కావలసిన పదార్థాలు:-
నిమ్మరసం – 1 గ్లాసు.
పంచదార – 4 గ్లాసులు.
నీళ్ళు – 1/2 గ్లాసు.
ఉప్పు – 1 టీ స్పూన్.
తయారు చేసే విధానం:
1.ముందుగా మంచి రసం ఉన్న నిమ్మకాయాలు తీసుకొని, కడిగి, శుభ్రపరచి, రసం తీసి, గింజలు రాకుండా వడకట్టాలి.
2.పంచదారలో అర గ్లాసు నీళ్ళు పోసి, తీగపాకం వచ్చేంతవరకు ఉడికనివ్వాలి. పాకం ఉడకుతున్నప్పుడే టీ స్పూనుతో ఉప్పుని నిమ్మరసంలో కలిపి, పాకంలో పోసి ఒక్కసారి కలిపి దించాలి.
3 పాకం బాగా చల్లారిన తర్వాత గట్టి మూత ఉన్న పొడి గాజు సీసాలో పోసి మూత పెట్టాలి. సర్వ్ చేసేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళకి 2 స్పూన్లు పాకం వేసి ఐసు ముక్క వేసి పైన యాలుకపొడి చల్లి సర్వ్ చేయాలి.

వ్యాఖ్యానించండి